అక్షరటుడే, వెబ్డెస్క్: Flight Crashes | గుజరాత్లోని అహ్మదాబాద్(Ahmedabad)లో గురువారం లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India plane) కూలిపోయింది. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతో మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బందితో పాటు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. దేశంలో గతంలోనూ విమాన ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందారు. గతంలో జరిగిన ప్రమాదాలు ఇవే..
1949 జూలై 2 : ఇండోనేషియాలోని జకార్తా నుంచి నెదర్లాండ్ వెళ్తున్న విమానం ముంబయి(Mumbai)లో కూలిపోయింది. వాతావరణం బాగా లేకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ముంబయిలోని ఘట్కోబార్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు.
1962 జూలై 7న అలిటాలియా విమానం 771 ముంబైకి ఈశాన్యంగా ఉన్న కొండను సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నావిగేషన్ లోపంతో జరిగింది. ప్రమాదంలో విమానంలోని 94 మంది మరణించారు.
1963 జూలై 28 : యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో కూలిపోయింది. అందులో ఉన్న 63 మంది మరణించారు. వాతావరణం బాగా లేకపోవడంతో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది.
1972 జూన్ 14 : జపాన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీలోని పాలం(ఇందిరాగాంధీ) విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న 87 మందిలో 82 మంది మరణించారు. ఆ సమయంలో అక్కడున్న ముగ్గురు స్థానికులు సైతం చనిపోయారు.
1973 మే 31 : ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరువలో పైలట్ తప్పిదం కారణంగా కూలిపోయింది. విమానంలో ఉన్న 65 మందిలో 48 మంది మరణించారు.
1976 అక్టోబర్ 12 : ఇంజిన్ వైఫల్యంతో మంటలు చెలరేగడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బొంబాయిలో కూలిపోయింది. విమానంలో ఉన్న 95 మంది మరణించారు.
1978 జనవరి 1 : కాక్పిట్లోని విమాన పరికరాల్లో ఒకటి చెడిపోవడంతో కెప్టెన్ నియంత్రణ కోల్పోయి ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలిపోయింది. అందులో ఉన్న 213 మంది మృతి చెందారు.
1982 జూన్ 21 : ముంబైలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది. బ్యాడ్ వెదర్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది 15 మంది ప్రయాణికులు చనిపోగా, 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
1988 అక్టోబర్ 19 : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. పైలట్ తప్పిదంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 130 మంది మరణించారు.
1990 ఫిబ్రవరి 14 : ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నంలో కూలిపోయింది. 92 మంది మరణించారు.
1991 ఆగస్టు 16 : ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఇంఫాల్లో ల్యాండ్ అవుతుండగా పైలట్ తప్పిదంతో కూలిపోయింది. అందులోని 69 మంది ప్రయాణికులు మరణించారు.
1993 ఏప్రిల్ 26 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి బయలుదేరుతుండగా ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వే చివరన ఒక ట్రక్కును ఢీకొట్టింది. పైలట్ తప్పిదం, హైవే ట్రాఫిక్ను నియంత్రించడంలో విమానయాన యంత్రాంగం వైఫల్యంతో ప్రమాదం చోటు చేసుకుంది.
1996 నవంబర్ 12 : సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం(Airlines plane), కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లోనే ఢీకొన్నాయి. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ పైలట్ చేసిన తప్పిదంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు విమానాల్లో ఉన్న 349 మంది కూడా మరణించారు. సౌదీ విమానం ఆ సమయంలో ఢిల్లీ నుంచి వెళ్తోంది.
2000 జూలై 17: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ పాట్నాలోని ఒక నివాస ఎస్టేట్లో కూలిపోయింది. విమానంలోని 55 మంది, స్థానికులు ఐదుగురు మృతి చెందారు.
2010 మే 22 : దుబాయ్-మంగళూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు విమానాశ్రయంలో క్రాష్ అయింది. ల్యాండింగ్ అవుతుండగా రన్ వేను దాటి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. విమానంలోని 158 మంది ప్రయాణికులు మరణించారు.
2020 ఆగస్టు 7 : దుబాయ్-కోళికోడ్ మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు ముక్కలైంది. ల్యాండింగ్ అవుతుండగా రన్వేను దాటి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. 18 మంది మృతి చెందారు.
ఇవే కాకుండా పలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానాలు సైతం ప్రమాదాల బారీన పలువురు సిబ్బంది మృతి చెందారు.