అక్షరటుడే, వెబ్డెస్క్:Traffic Police | హైదరాబాద్(Hyderabad) మహా నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ట్రాఫిక్ జామ్(Traffic Jam)తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.
అయినా కూడా కొందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. రాంగ్రూట్లలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అలాంటి వారి ఆట కట్టించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) ఈ నెల 20 నుంచి 26 వరకు వాహనాల తనిఖీ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న 14,917 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే నంబర్ ప్లేట్ను కనిపించకుండా చేసిన 3,881 మందిపై కేసు బుక్ చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Traffic Police | వీకెండ్తో తప్ప తాగి..
కొందరు తప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో డ్రంకన్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వారాంతంలో మందుబాబులు బాగా తాగి రోడ్లపై రయ్యున దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు శని, ఆదివారాల్లో డ్రంకన్ డ్రైవ్(Drunk Driving) స్పెషల్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 252 మందిపై కేసులు నమోదు చేసి, వారి వాహనాలను సీజ్ చేశారు. వీరిలో 21 నుంచి 40 ఏళ్లలోపు వారు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.