అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి జిల్లా(Rangareddy district) పెద్దఅంబర్ పేట్(Pedda Amberpet) ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధి సర్వీస్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన రమావత్ మాన్ సింగ్(38) యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Yadagirigutta Traffic Police Station)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరే గురువారం డ్యూటీ ముగించుకొని ఇంటికి బైక్ పై బయలుదేరారు.
పెద్దఅంబర్ పేట్ కు రాగానే మాన్ సింగ్ ముందర వెళ్తున్న టిప్పర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆగింది. ఊహించని ఈ పరిణామానికి మాన్ సింగ్ టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీ కొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై కానిస్టేబుల్ మాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.