More
    Homeజిల్లాలునిజామాబాద్​Traffic Police | ట్రాఫిక్​లో అడ్డదారి వసూళ్లు.. అధికారుల తీరుపై విమర్శలు.. ఓ ఉన్నతాధికారి అటాచ్

    Traffic Police | ట్రాఫిక్​లో అడ్డదారి వసూళ్లు.. అధికారుల తీరుపై విమర్శలు.. ఓ ఉన్నతాధికారి అటాచ్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Traffic Police : నిజామాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు సరికొత్త వసూళ్ల దందాకు తెరలేపారు. ఎన్​ఫోర్స్ మెంట్​ పేరిట అడ్డదారిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.

    నిజామాబాద్​ నగరంలో నిత్యం ఏదో ఒకచోట ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరిపై ఎంవీ యాక్ట్, డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారంలో ఓ అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీయడం పోలీసు వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది.

    నిజామాబాద్​ సీపీగా సాయి చైతన్య cp sai Chaitanya బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ట్రాఫిక్​ ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి కమిషనరేట్​ వ్యాప్తంగా ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేయిస్తున్నారు. మైనర్​ డ్రైవింగ్​, త్రిపుల్​ రైడింగ్​, డ్రంక్​ అండ్​ డ్రైవ్​, సౌండ్​ పొల్యూషన్​(సైలెన్సర్లు) వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని ఠాణాల ఎస్​హెచ్​వోలకు ఆదేశాలు జారీ చేశారు.

    READ ALSO  Food festival | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

    ఈ క్రమంలోనే పోలీసులు పగలు, రాత్రుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దీంతో చాలా వరకు వాహనదారుల్లో మార్పు వచ్చింది. ఇలాగే ఇంకొద్ది నెలల పాటు ఎన్​ఫోర్స్ మెంట్​ జరిగితే ట్రాఫిక్​ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించే అవకాశం ఉంది.

    Traffic Police : ఆ అధికారి వసూళ్లపై చర్చ..

    వాహనాల తనిఖీలు ఒక అంశం ఒకెత్తు అయితే.. దీని వెనుక ఓ అధికారి వసూళ్లకు తెర తీయడం మరో అంశం. నిజామాబాద్​ ట్రాఫిక్​ ఠాణాలో పనిచేస్తున్న సదరు అధికారి ఎన్​ఫోర్స్ మెంట్​ ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. ఈయన ఒత్తిడి తట్టుకోలేక పలువురు సిబ్బంది సెలవులు పెట్టి వెళ్లిపోతున్నట్లు సమాచారం.

    Traffic Police : అవేంటో పరిశీలిస్తే..

    • అధిక శబ్దంతో ఉండే సైలెన్సర్లు ఉన్న వాహనాలను గుర్తించి సదరు వాహనాలను సీజ్​ చేసి, వాటిని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​కు తరలిస్తున్నారు. తదనంతరం సైలెన్సర్లు మార్చేస్తున్నారు. కాగా, సదరు అధికారి చెప్పిన దుకాణానికే వెళ్లి అక్కడ సైలెన్సర్​ కొనుగోలు చేసి బిగిస్తేనే వాహనాన్ని రిలీజ్​ చేస్తుండటం గమనార్హం. వినాయక్​ నగర్​ రాజీవ్​గాంధీ విగ్రహం వద్ద గల దుకాణం నిర్వాహకులతో సదరు అధికారి ముందస్తు బేరం చేసుకుని, రూ.1500 విలువ గల సైలెన్సర్​ను రూ.2 వేల పైచిలుకు విక్రయింపజేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కోడై కూస్తోంది.
    • సదరు అధికారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కడ తనిఖీలు నిర్వహిస్తే.. అదే ప్రాంతంలో హెల్మెట్​లు విక్రయించే దుకాణం తాత్కాలికంగా వెలుస్తోంది. ఎవరైనా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్​ లేకుండా పట్టుబడితే.. వెంటనే సదరు దుకాణంలో బలవంతంగా హెల్మెట్​ కొనుగోలు చేయిస్తారు. లేదంటే, వాహనాన్ని వదిలిపెట్టరు. అలా రూ.400 విలువ చేసే శిరస్త్రాణం రూ.600 వరకు విక్రయించేలా ఒప్పందం చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు.
    • డ్రంక్​ అండ్​ డ్రైవ్(డీడీ)​ కేసుల్లో సైతం సదరు అధికారి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. సాధారణంగా డీడీ కేసుల్లో పట్టుబడిన వారిని కౌన్సెలింగ్​ ఇచ్చిన అనంతరం, కోర్టులో ప్రవేశపెడతారు. కాగా, ఈ కేసుల్లోనూ సంబంధిత కోర్టు పీసీకి వసూళ్లపై టార్గెట్​ విధించినట్లు సమాచారం. ఒక్కో కేసు వెనుక రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, గతంలో కంటే ఈ అధికారి వచ్చిన తర్వాత డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు పెరగడం అవినీతి దందాకు అద్దం పడుతోంది.
    READ ALSO  Yoga Day | ఉత్సాహంగా యోగా దినోత్సవం

    Traffic Police : పరస్పర ఫిర్యాదులు

    ట్రాఫిక్​ స్టేషన్​లో జరుగుతున్న వ్యవహారంపై సొంత విభాగం అధికారుల మధ్యనే వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు అధికారులు ఉన్నతాధికారులకు వేర్వేరుగా పరస్పరం ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. స్పెషల్​ బ్రాంచి సిబ్బంది ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ట్రాఫిక్ విభాగానికి కీలకంగా ఉన్న ఓ అధికారి డీజీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఇందుకు గల కారణాలపై స్పష్టత లేదు. మరో అధికారిపై త్వరలోనే చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

    Latest articles

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    More like this

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...