అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా (TPCC General Secretary chandrashekar Reddy) నియమితులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్లో ఈ సందర్భంగా ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.