ePaper
More
    HomeజాతీయంBharat Bandh | రేపు కార్మిక సంఘాల భార‌త్‌బంద్‌.. స‌మ్మెలో పాల్గొన‌నున్న 25 కోట్ల మంది...

    Bharat Bandh | రేపు కార్మిక సంఘాల భార‌త్‌బంద్‌.. స‌మ్మెలో పాల్గొన‌నున్న 25 కోట్ల మంది కార్మికులు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Bharat Bandh | కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక, రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు బుధ‌వారం భార‌త్ బంద్‌(Bharat Bandh)కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్ల‌కు పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనున్నారు. దీంతో కీల‌క రంగాల్లో సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగ‌నుంది. జూలై 9ర‌ దేశవ్యాప్తంగా సమ్మెకు 10 కేంద్ర కార్మిక సంఘాల(Central Trade Unions) ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలోచేరడానికి అధికారిక, అనధికారిక రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు సిద్ధమవుతున్నారు. కార్మికులు చేప‌ట్టిన ఈ నిర‌స‌న‌తో బ్యాంకింగ్, బీమా, రవాణా, విద్యుత్, పోస్టల్ కార్యకలాపాలతో సహా ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగిస్తుందని భావిస్తున్నారు.

    Bharat Bandh | ప్ర‌భుత్వ విధానాల‌ను నిర‌సిస్తూ..

    ప్రభుత్వం అవ‌లంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాల‌కు, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా సమ్మె చేప‌డుతున్న‌ట్లు ఉమ్మడి ట్రేడ్ యూనియన్ ఫోరం(Trade Union Forum) వెల్ల‌డిచింది. ప్ర‌ధానంగా నాలుగు కొత్త కార్మిక కోడ్‌ల అమలు, ప్రభుత్వ రంగ యూనిట్లు, ముఖ్యమైన సేవల ప్రైవేటీకరణ, శాశ్వత ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టలైజేషన్,యూనియన్ కార్యకలాపాలను బలహీనపరచడం వంటి వాటిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు భార‌త్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ(Union Ministry of Labour) ముందు 17 పాయింట్ల డిమాండ్లను ఉంచ‌గా, పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో స‌మ్మెకు సిద్ధ‌మయ్యారు.

    READ ALSO  New Schools | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 571 పాఠశాలలు

    Bharat Bandh | ప్ర‌ధాన యూనియ‌న్ల ఆధ్వ‌ర్యంలో..

    భార‌త్ బంద్‌లో దాదాపు అన్ని ప్ర‌ధాన యూనియ‌న్లు పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, హింద్ మజ్దూర్ సభ వంటి ప్రధాన యూనియన్ల నాయకులు స‌మ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. నిర్మాణ, మైనింగ్, రవాణా, తయారీ, బ్యాంకింగ్, బీమా, వ్యవసాయ రంగాలలో ఉన్న 25 కోట్లకు పైగా కార్మికులు బంద్‌లో పాల్గొంటార‌ని ఏఐటీయూసీ నేత అమర్‌జీత్ కౌర్(AITUC Leader Amarjeet Kaur) చెప్పారు. 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. బ్యాంకింగ్, బీమా సిబ్బంది దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటామ‌ని తెలిపారు. పోస్టల్ ఉద్యోగులు(Postal Employees), ప్రజా రవాణా సిబ్బంది కూడా విధులు బ‌హిష్క‌రించ‌నున్నారు.

    READ ALSO  Warangal | ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ.. ముగ్గురి సజీవ దహనం

    Bharat Bandh | బ్యాంకు సేవ‌ల‌కు అంత‌రాయం..

    భార‌త్ బంద్ నేప‌థ్యంలో కీలక సేవలకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ(Government), సహకార బ్యాంకులు(Co Operative Banks) నిలిచి పోతాయ‌ని చెబుతున్నారు. బీమా సేవలు, పోస్టల్ డెలివరీలు నిలిచి పోనున్నాయి. సంఘటిత రంగాలలో బొగ్గు తవ్వ‌కాలు, పారిశ్రామిక ఉత్పత్తికి అంత‌రాయం క‌లుగ‌నుంది. అయితే, విద్యాసంస్థ‌లు యాథ‌విధిగానే ప‌ని చేయ‌నున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలు ప‌ని చేస్తాయి. అత్యవసర సేవలను బంద్ నుంచి మిన‌హాయించారు.

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...