Site icon aksharatoday.in

Toll Charges | బైక్​లకు టోల్​ ఛార్జీ.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

Toll Charges

Toll Charges | బైక్​లకు టోల్​ ఛార్జీ.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Charges | దేశవ్యాప్తంగా ఇక నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్​ ఛార్జీలు(Toll charges) వసూలు చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూలై 15 నుంచి బైక్​లకు టోల్​ వసూలు చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ద్విచక్రవాహనదారులు(Two Wheelers) ఆందోళన చెందారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ(Transport Minister Nitin Gadkari) స్పందించారు. టూవీలర్లపై టోల్ ఛార్జీల ప్రచారాలను ఆయన ఖండించారు. ఇలాంటి తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేయొద్దని సూచించారు.

Toll Charges | టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్​ ఛార్జీలు లేవు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాలు(Toll plazas) పెట్టి జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) టోల్​ వసూలు చేస్తోంది. టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్​ ఛార్జీలు లేవు. వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కార్ల నుంచి మొదలు పెడితే భారీ ట్రక్కుల వరకు ఎన్​హెచ్​ఏఐ టోల్​ వసూలు చేస్తోంది. ఆయా వాహనాల రకాన్ని బట్టి టోల్​ ఛార్జీ ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనాలకు టోల్​ వసూలు చేస్తారని ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటనలో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version