అక్షరటుడే, వెబ్డెస్క్:Amit Shah | మావోయిస్టులకు(Maoists) నిద్ర లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సల్స్ విముక్త భారతదేశాన్ని చూస్తారని ఆయన పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్(Operation Kagar) చేపట్టిన విషయం తెలిసిందే. మావోలకు పట్టు ఉన్న అటవీ ప్రాంతాల్లోకి కూడా కేంద్ర బలగాలు చొచ్చుకు వెళ్లి ఎన్కౌంటర్లు(Encounters) చేస్తున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో అమిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amit Shah | ఆయుధాలు వీడండి
ప్రతి సంవత్సరం వానాకాలంలో మావోయిస్టులు రెస్ట్ తీసుకుంటారని అమిత్ షా(Amit Shah) అన్నారు. కానీ ఈ ఏడాది వారికి నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించారు. వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని ఆయన మావోయిస్టులకు సూచించారు. ఆపరేషన్ కగార్ ఆపాలని, కేంద్ర ప్రభుత్వం(Central Government)తో తాము శాంతి చర్చలకు సిద్ధమని కొంతకాలంగా మావోయిస్టులు కోరుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా స్పందిస్తూ వారితో చర్చలు అవసరం లేదన్నారు. లొంగిపోయిన వారికి చేయూత అందిస్తామని ప్రకటించారు.