More
    Homeక్రీడలుIPL 2025 | నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్.. పంజాబ్‌తో ఆడే జ‌ట్టు ఏది..!

    IPL 2025 | నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్.. పంజాబ్‌తో ఆడే జ‌ట్టు ఏది..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫ‌య‌ర్ Qualifier 1మ్యాచ్ చాలా చ‌ప్ప‌గా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్(Punjab) త‌క్కువ స్కోర్ చేయ‌గా, ఆర్సీబీ ఆ టార్గెట్‌ని సులువుగా చేధించింది.

    ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore). ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. అయితే క్వాలిఫ‌య‌ర్‌లో ఓట‌మి చెందిన పంజాబ్ మ‌రో మ్యాచ్ ఆడ‌నుంది.

    READ ALSO  WTC Final | నేడే టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్.. స‌ఫారీ జ‌ట్టు క‌ల‌ని నెర‌వేర్చుకుంటుందా..!

    Eliminator match : ట‌ఫ్ ఫైట్..

    ప్లేఆఫ్స్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians – MI) కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans – GT)తో తలపడనుంది. అయితే, ఈ కీలక సమరానికి ముందు ముంబై జట్టులో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. విధ్వంసకర ఆటగాళ్లు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని, వారి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (England star batsman Jonny Bairstow) ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. జానీ బెయిర్‌స్టో వంటి అనుభవజ్ఞుడైన, ప్రపంచ స్థాయి ఆటగాడి రాకతో ఆ లోటు భర్తీ అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. బెయిర్‌స్టో ఓపెనర్‌గా లేదా మిడిల్ ఆర్డర్‌లో ఆడగల సమర్థుడు.

    READ ALSO  IPL | ఆర్సీబీని ఐపీఎల్ అన్‌ఫాలో చేసిందా.. ఏడాది పాటు నిషేధం కూడానా?

    వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించగలడు. ఇది జట్టుకు అదనపు బలం చేకూరుస్తుంది. బెయిర్‌స్టో చేరికతో, ముంబై ఇండియన్స్ తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. రోహిత్ శర్మతో Rohit Sharma కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    ముంబై ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గెల‌వాల‌నే క‌సితో ఉండ‌గా, మ‌రోవైపు జీటీ కూడా ప‌క్కా ప్రణాళిక‌లు అమ‌లు చేస్తుంది. రెండు టీమ్‌ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ రెండింట్లో గెలిచే టీమ్‌తో పంజాబ్ ఆడ‌నుంది. వారు ఫైన‌ల్‌లో ఆర్సీబీతో త‌ల‌ప‌డ‌నున్నారు. చూడాలి మ‌రి ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో..!

    Latest articles

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ...

    KTR | కేటీఆర్​ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్​ రాజు

    అక్షరటుడే, నిజాంసాగర్​: KTR | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు (Former ZP...

    More like this

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ...