More
    Homeభక్తిPuri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే ఒడిషా(Odisha)లోని పూరి(Puri). చార్‌ధామ్‌(Char Dham) పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఏటా ఆషాఢ(Ashadha) మాసంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర(Jagannath Rath Yatra)లో లక్షలాది మంది పాల్గొని తరిస్తారు.

    ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో, ఏకమూర్తిగానో వెలుస్తాడు. కానీ పూరీలో విశేషం ఏమిటంటే సోదరుడు బలరాముడు(Balaramudu), సోదరి సుభ్రద(Subhadra)లతో కలిసి కొలువుతీరాడు. ఈ క్షేత్రం శ్రీకృష్ణుడి స్థిర నివాసంగా శ్రీక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ కొలువుదీరిన కృష్ణ పరమాత్మ జగన్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. ఇది జగన్నాథుడి పురం.. అందుకే దీనిని జగన్నాథపురి అని వ్యవహరించేవారు. ఇది కాలక్రమంలో పూరీగా స్థిరపడింది. ఏటా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు.

    ఈ యాత్ర శుక్రవారం(Friday) ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ మాసంలో శుక్ల పక్ష ద్వితీయ తిథి(Shukla Paksha Dwitiya Tithi) నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగినదిగా ప్రసిద్ధికెక్కింది. తొమ్మిది రోజుల(Nine days)పాటు కనుల పండువగా సాగే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

    READ ALSO  PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    Puri Jagannath Rath Yatra : రెండు నెలల ప్రక్రియ..

    జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రకు ముందు పెద్ద కార్యక్రమమే ఉంటుంది. జ్యేష్ఠ మాసం(jyeshta masam)లో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున 108 బిందెల ద్వారా దేవతామూర్తులను అభిషేకిస్తారు. ఆ తరువాత స్వామికి జ్వరం వచ్చిందని ప్రకటించి… విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర (Rath yatra)మొదలవుతుంది.

    జగన్నాథుడి రథయాత్రలో స్వామే స్వయంగా గర్భగుడి దాటి బయటకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడన్నది భక్తుల విశ్వాసం. అలా వచ్చే జగన్నాథుడితోపాటు సుభద్ర, బలభద్రులకోసం మూడు రథాలను తయారుచేస్తారు.

    జగన్నాథుడి రథాన్ని నందిఘోష(Nandighosh rath) అంటారు. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. బలభద్రుడి రథం తాళధ్వజం(Taladhwaja), సుభద్రాదేవి రథం పేరు దర్పదలన్‌(Darpadalana). జగన్నాథుడి రథానికి ధారకుడు, బలభద్రుని రథానికి మాతలి, సుభద్రాదేవి రథానికి అర్జునుడు సారథులు. రథయాత్రకు సరిగ్గా అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విదియనాడు వృక్షాలకు పూజలు చేసి, ఆ చెట్లను 1,072 ముక్కలు చేసి పూరికి తరలిస్తారు. అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణం మొదలుపెడతారు. రథయాత్ర ప్రారంభంలోగా పూర్తి చేస్తారు.

    READ ALSO  Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    Puri Jagannath Rath Yatra : రథయాత్ర సాగుతుందిలా..

    మేళతాళాలతో పాండాలు(పూజారులు) పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం పూజ పూర్తయ్యాక జగన్నాథుని పేరును పెద్దగా ఉచ్చరిస్తూ పూజారులు రత్నపీఠంపై నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్‌, అరుణ స్తంభం మీదుగా ఊరేగిస్తారు. ముందుగా బలరాముడిని, తర్వాత సుభద్రాదేవిని, ఆ తర్వాత జగన్నాథ స్వామిని తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని ‘పహండీ’ అంటారు. అశేష జనవాహిని జగన్నాథుని రథం పట్టుకుని ముక్తకంఠంతో ‘జగన్నాథా’ అని బిగ్గరగా ఉచ్చరిస్తూ లాగుతారు.

    జగన్నాథుడి ఆలయం నుంచి మూడు మైళ్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అశేష జనవాహిని ఉండటంతో అంత నెమ్మదిగా సాగుతుంది. పూరీ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్యే గుండీచా. స్వామి అక్కడ ఆతిథ్యం స్వీకరిస్తాడు. వారం పాటు విశ్రమించి, తిరిగి దశమినాడు బహుదా యాత్ర ద్వారా జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు.

    READ ALSO  Aashada Masam | విష్ణు పూజ.. గురు ఆరాధన.. అమ్మకు బోనం.. ఎన్నో విశిష్టతల మాసమే ఆషాఢం

    Puri Jagannath Rath Yatra : ప్రత్యేకతలు..

    చెరా పహరా ఆచారం: ఈ ఉత్సవంలో ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి చెరా పహరా. ఈ సంప్రదాయంలో పూరి రాజు బంగారు చీపురుతో రథాల మార్గాన్ని శుభ్రం చేస్తారు. ఇది వినమ్రత, సమానత్వాన్ని సూచిస్తుంది.

    మహాప్రసాదం: జగన్నాథ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద రసోయి ఉంది. ఇక్కడ రోజూ లక్షలాది మంది భక్తులకు మహాప్రసాదం తయారు చేసి అందిస్తారు. ఈ ప్రసాదం మోక్షాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉందని భక్తులు నమ్ముతారు.

    ప్రస్తుతం పూరీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ రథయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇస్కాన్‌(ISKCON) ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో రథయాత్రలు జరుగుతున్నాయి.

    Latest articles

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    More like this

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...