అక్షరటుడే, ఇందూరు: TNGO’s | టీఎన్జీవోస్ జిల్లా నాయకులు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావును (Government Chief Secretary Ramakrishna Rao) బుధవారం హైదరాబాద్ లో కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయించిన మేరకు అంశాల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (Employee Health Scheme) కోసం పునర్ వ్యవస్థీకరణ కమిటీ వేయాలని కోరారు. ప్రతినెలా రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని విన్నవించారు.
తమ వినతులపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ (Employees JAC) రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్), రాష్ట్ర సహాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.