అక్షరటుడే, వెబ్డెస్క్:West Godavari | ఇల్లు కట్టాలంటే కనీసం సెంట్ భూమి (48 గజాల స్థలం) కావాలని అంటారు. మాములుగా చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా 50 గజాల స్థలం అవసరం. 24 గజాల స్థలంలో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. ఒకవేళ నిర్మించిన చిన్న షెడ్డు లాంటిది వేసుకోవచ్చు. కానీ భవనాలు(Buildings) నిర్మించడం సాధ్యం కాదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు(Palakoderu)లో ఓ వ్యక్తి 24 గజాల్లో ఏకంగా మూడంతస్తుల బిల్డింగ్ కట్టేశారు.
ఎలాంటి అనుమతులు(Permissions) లేకుండా ఇంత తక్కువ స్థలంలో భవనం నిర్మించడం గమనార్హం. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. అయిన సదరు భవన యజమాని ఇవేమి పట్టించుకోకుండా మూడు ఫ్లోర్ల బిల్డింగ్(Thible Store building) నిర్మించాడు. ఈ భవనాన్ని చూసి స్థానికులతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Deputy Speaker Raghurama Krishnam Raju) కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల సీసీ రోడ్డు ఓపెనింగ్(CC road opening) కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన ఆయన ఆ భవనాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే దానిని కూల్చివేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.