అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk Drive Test | మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ (SI gangadhar) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వాహనదారులకు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. అయితే ముగ్గురు వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు.
దీంతో మంగళవారం ఉదయం వీరిని మార్నింగ్ కోర్టులో (Morning Court) హాజరుపర్చగా.. శివాజీనగర్కు (Shivajinagar) చెందిన కరుణాకర్, నాగారం ప్రాంతానికి చెందిన మజార్ అలీకి నాలుగు రోజుల జైలుశిక్ష, ఖిల్లారోడ్డు ప్రాంతానికి చెందిన జనార్దన్కు రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.