అక్షరటుడే, వెబ్డెస్క్ : Eastern Railways | కేంద్ర ప్రభుత్వం central govt రైల్వేలను railways ఆధునికీకరించాలని అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లను ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ secunderabad railway station లో కూడా ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అంతేగాకుండా రైల్వే శాఖ రైళ్లలోను మార్పులు చేస్తోంది. వేగంగా వెళ్లే వందే భారత్ రైళ్లను vaned bharat trains తీసుకొచ్చింది.
రైళ్లలో వసతులు మెరుగు పరచడంతో పాటు పరిశుభ్రతకు cleanness చర్యలు చేపట్టింది. అయితే రైల్వేశాఖ, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు చేస్తున్న పనులతో రైల్వే స్టేషన్లు railway stations, రైళ్లు trains అపరిశుభ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గుట్కా, పాన్ gutka pan masala తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. దీంతో రైళ్లు, స్టేషన్లలో అపరిశుభ్రత నెలకొంది. ఇలాంటి వారి పని పట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది
Eastern Railways | మూడు నెలల్లో..
రైళ్లలో, స్టేషన్ల ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసే వారికి రైల్వే శాఖ భారీగా జరిమానా huge fine విధిస్తోంది. కాగా.. 2025 మొదటి 3 నెలల్లో రైల్వే స్టేషన్లలో ఉమ్మివేసిన వారి నుంచి తూర్పు రైల్వేలు రూ.32 లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశాయి. మిగతా జోన్ల రైల్వేలలో కూడా ఉమ్మివేసిన వారిపై భారీగా ఫైన్లు వేస్తున్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేసే వారికి ఎప్పటి నుంచో భారీ మొత్తంలో జరిమానాలు అమలు చేస్తున్నారు. ఇండియాలోనూ ఈ తరహా జరిమానాలు విధిస్తేనే మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.