అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Chandrababu | సెల్ఫోన్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley)పై విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. తాను 25 ఏళ్ల క్రితం సెల్ఫోన్ గురించి మాట్లాడినప్పుడు అందరూ హేళన చేశారన్నారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, నీళ్లు ఇస్తుందా, షెల్టర్ ఇస్తుందా అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ రోజు భర్త లేకుండా భార్య ఉంటుందని, భార్య లేకుండా భర్త ఉంటున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కానీ వారిద్దరు సెల్ఫోన్ (Cell Phone) లేకుండా ఉండడం లేదన్నారు. జీవితంలో ప్రస్తుతం సెల్ఫోన్ భాగం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
CM Chandrababu | సాంకేతిక కేంద్రంగా అమరావతి
కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిలో పలు కంపెనీలు నెలకొల్పేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. ఇందులో భాగంగా అమరావతిలో క్వాంటమ్ పార్క్ (Quantum Park) ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం బాబు మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్ను అందిపుచ్చుకోవాలని సూచించారు.
CM Chandrababu | ఆనాడే చెప్పా..
భారత్ ఐటీ హబ్గా మారుతుందని తాను తొలిసారి సీఎం అయినప్పుడే చెప్పినట్ల చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్గేట్స్తో కలిసి ఐటీ అభివృద్ధిపై చర్చించానన్నారు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రాజధానిలో సంస్థలను నెలకొల్పాలని ఆయన స్టార్టప్ కంపెనీలను ఆహ్వానించారు.