అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Duty Meet | విధి నిర్వహణలో భాగంగా పోలీసుల్లో పోటీతత్వం ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai chaitanya) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో (Police Command Control Room) శుక్రవారం పోలీస్ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు పనిచేసే పద్ధతి మెరుగుపడాలని సీపీ పేర్కొన్నారు.
సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా శుక్రవారం పోలీసులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని రాష్ట్రస్థాయిలో జరిగే డ్యూటీ మీట్కు పంపనున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), సీసీఎస్ ఏసీపీ నాగవేంద్ర చారి, సీసీఆర్బీ ఏసీబీ రవీందర్రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.