అక్షరటుడే, అమరావతి: Tadepalli అర్ధరాత్రి.. మద్యం మత్తులో ఉన్న నేర చరిత యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులయ్యారు. ఆమెపై పైశాచికంగా దాడికి దిగారు. గర్భంతో ఉన్నానని చెప్పినా వినలేదు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని తాడేపల్లి పోలీస్టేషన్(Tadepalli police station) పరిధి పాత జాతీయ రహదారి(national highway)లో ఉన్న పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
బాధితుల కథనం ప్రకారం.. ఆనందరావు రైల్వే ఉద్యోగి(railway employee). ఆమె భార్య ఆర్పీఎఫ్ కానిస్టేబుల్(RPF constable) సునీత. వీరు ఉండవల్లిలో నివాసం ఉంటూ విజయవాడ(Vijayawada)లో విధులు నిర్వహిస్తున్నారు.
ఎప్పటిలాగే ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. పోలకంపాడు(Polakampadu) మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఢీకొన్నాడు. సునీత అయిదు నెలల గర్భిణి. కిందపడిపోయిన ఆమెను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వారిపై దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టారు. రెచ్చిపోయిన ఉన్మాద యువకులు ఫోన్ చేసి ఇంకకొందరిని అక్కడికి పిలిపించారు. అంతా గుమిగూడి ఆనందరావు, సునీతను రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టారు.
బాధిత భార్యాభర్తలు రక్షించండంటూ కేకలు వేయడంతో.. తాడేపల్లి పోలీసులు వస్తున్న విషయం తెలిసి యువకులు పారిపోయారు. సదరు యువకులపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయంలో బాధితులు తాడేపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.