More
    HomeతెలంగాణBandi Sanjay | అప్పుడు బీఆర్​ఎస్​ టచ్​లోకి వచ్చింది.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Bandi Sanjay | అప్పుడు బీఆర్​ఎస్​ టచ్​లోకి వచ్చింది.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bandi Sanjay | బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party)ని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

    తాజాగా ఆమె వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ స్పందించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య నాలుగు ముక్కలాట నడుస్తోందన్నారు. కవిత వ్యవహారంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

    Bandi Sanjay | అరెస్ట్​ చేయకుండా ఉండేందుకు..

    కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో బీఆర్ఎస్​ కలపడానికి యత్నించారని బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. “లిక్కర్​ స్కామ్(Liquor scam)​లో కవిత​ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్​ చేయకుండా ఉంటే పార్టీని విలీనం చేస్తామని బీఆర్​ఎస్​ నేతలు తమకు టచ్​లోకి వచ్చారు. అయితే కుటుంబ, అవినీతి పార్టీ అయిన బీఆర్​ఎస్​(BRS)ను తాము దగ్గరకు కూడా రానివ్వలేదు” అని ఆయన తెలిపారు. బీజేపీ బలపడుతున్న ప్రతిసారీ కేసీఆర్​ కొత్త డ్రామాలకు తెరలేపుతారన్నారు. ఆ క్రమంలో తాజాగా కవిత ఎపిసోడ్​ నడుస్తోందని విమర్శించారు.

    READ ALSO  MLC Kavitha | రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం.. ఎమ్మెల్సీ కవిత

    Bandi Sanjay | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం

    ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇచ్చిన మాట ప్రకారం దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నదాతల ఆదాయాన్ని 80శాతం పెంచామన్నారు. 2014లో వరికి మద్దతు ధర క్వింటాల్​కు రూ.1,310 ఉండేదన్నారు. ఇటీవల కేంద్రం రూ.69 పెంచడంతో రూ.2,389కి పెరిగిందన్నారు. త్వరలో వందశాతం పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచినట్లు వివరించారు. మార్కెట్లో యూరియా ధరలు పెరిగినప్పటికీ.. రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆ భారాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు.

    Latest articles

    Banswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్...

    Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.ఏటూరునాగారం...

    Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం(State Government) పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma...

    Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్ ఫార్మా పార్క్‌కు శ్రీకారం.. ఐదు గ్రామాల్లో 1,472 ఎకరాల్లో అభివృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ లలిత్‌పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొత్త...

    More like this

    Banswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్...

    Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.ఏటూరునాగారం...

    Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం(State Government) పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma...