అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి పట్టణంలోని kamareddy town తన నివాసంలో లబ్ధిదారులకు శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రి పాలైన బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా ఉంటుందన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఒరిజినల్ బిల్స్తో తమను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో (Kamareddy Constituency) పేదల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.