అక్షరటుడే, ఇందూరు: Tiranga Rally | నగరంలో 19న నిర్వహించనున్న తిరంగా ర్యాలీని (Tiranga Rally) విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో (MLA Camp Office) విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరణిస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రపంచమంతా చూసిందన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుంది కాబట్టే ‘ఆపరేషన్ సింధూర్’ను తాత్కాలికంగా నిలిపేసిందన్నారు.
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైనందుకు సైనికులకు కృతజ్ఞతాభావంగా ఈనెల 19న జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడంతో భారత సైనిక శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటామన్నారు. ఎస్–400 (S-400) సుదర్శన చక్రంలా భారతదేశాన్ని కాపాడిందని కొనియాడారు. సమావేశంలో తిరంగా ర్యాలీ కన్వీనర్ కృపాకర్ రెడ్డి (Tiranga Rally Convener Krupakar Reddy), శంకర్, వెంకట రమణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.