అక్షరటుడే నిజాంసాగర్:Nizamsagar | వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభ(silver jubilee meeting)ను బీఆర్ఎస్ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి(Former MPP Jyoti Durga Reddy) పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో సభ జరుగనుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ మనోహర్, పీఎస్ఎస్ ఛైర్మన్ విఠల్ రెడ్డి, పీఎస్ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.