అక్షరటుడే, ఇందూరు:GGH Nizamabad | జీజీహెచ్లో విధులు నిర్వహించే శానిటేషన్(Sanitation), పేషెంట్ కేర్(Patient Care), సెక్యూరిటీ సిబ్బంది సేవలు మరువలేనివని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్(GGH Superintendent Dr. Srinivas) అన్నారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ (AITUCI) ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సేవల ద్వారానే రాష్ట్రంలో ఆస్పత్రికి మంచి పేరు వచ్చిందన్నారు. మేడే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆస్పత్రిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కిరణ్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, ఏడీ రాజశేఖర్, నర్సింగ్ గ్రేడ్–2 సూపరింటెండెంట్ చంద్రకళ, కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు హైమద్ బేగం, స్వరూప, భారతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.