అక్షరటుడే, వెబ్డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు(Devotees) తరలి వస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు(Summer vacation) ముగియనున్నాయి. అంతేగాకుండా తాజాగా వాతావరణం కూడా చల్లబడింది. దీంతో తిరుమల వెంకన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్(Token)లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
శ్రీవారిని బుధవారం 78,288 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,079 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజు స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది.