అక్షరటుడే, వెబ్డెస్క్ : Car Sales | భారత్(Bharat)లో కార్ల కొనుగోళ్లు కొంతకాలంగా పెరుగుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలకు (Middle Class Families) చెందిన వారు గతంలో బైక్లతో జీవితాన్ని నెట్టుకు వచ్చేవారు.
కానీ.. మారుతున్న కాలంతో పాటు వారు కూడా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్నాళ్ల క్రితం ధనవంతులకే పరిమితమైన కార్లు ఇప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ అగ్రభాగాన ఉంది. 2025 మే నెలలో ఆ కంపెనీ 1,35,962 కార్లు విక్రయించడం గమనార్హం.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్లు అంతగా ఉండేవి కావు. ఉన్నా ఊరికి ఒకటో రెండో ఉంటే గొప్ప..! కానీ, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. మధ్య తరగతి వారు కూడా కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వాహనరుణాలు విరివిగా దొరుకుతుండటం కూడా కార్ల విక్రయాలు పెరగడానికి కారణం.
Car Sales | కార్ల విక్రయాల వివరాలు..
దేశంలో మారుతి సుజుకి, మహీంద్రా, టాటా, హ్యుందాయ్ లాంటి అనేక కార్ల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రజలు ఎక్కువగా మారుతి కార్లను కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండటం కూడా వీటి విక్రయాలు అధికంగా ఉండటానికి ఒక కారణం. గత నెలలో మారుతి సుజుకి 1,35,962 కార్లను విక్రయించింది. మహీంద్రా 52,431, హ్యుందాయ్ 43,861, టాటా మోటార్స్ 41,557, టయోటా 29,280, కియా మోటార్స్ 22,315, స్కోడా 6,740, ఎంజీ మోటార్స్ 6,304 కార్లను అమ్మాయి. హోండా 3,950, వోక్స్వాగన్ 2,848, రెనాల్ట్ 2,502, నిస్సాన్ 1,354, సిట్రోయెన్ 333 కార్లను విక్రయించాయి.