ePaper
More
    HomeతెలంగాణTiger Conservation | జీవో నంబర్​ 49పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఆదివాసీల హర్షం

    Tiger Conservation | జీవో నంబర్​ 49పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఆదివాసీల హర్షం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tiger Conservation | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమురం భీమ్​ కన్జర్వేషన్​ కారిడార్​ (Komuram Bheem Conservation Corridor) ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్​ 49 (G.O. 49)ను నిలిపివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దానిని నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

    Tiger Conservation | అసలు ఏమిటీ ఈ జీవో

    తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం జీవో 49 తీసుకొచ్చింది. టైగర్​ కన్జర్వేషన్ (Tiger Conservation)​ కోసం పలు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ జీవోతో ఆదివాసీ గ్రామాలు కనుమరుగవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

    READ ALSO  Weightlifting Association | 20న వెయిట్​ లిఫ్టింగ్ అసోసియేషన్​ ఎన్నికలు

    Tiger Conservation | ఆందోళనలు చేపట్టిన ఆదివాసీలు

    జీవో 49తో వందలాది గ్రామాలను ఖాళీ చేయించనున్నారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. జులై 21 (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా బంద్​ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివాసీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని జీవోను నిలిపివేయాలని నిర్ణయించింది.

    Tiger Conservation | మావోయిస్టుల పేరిట లేఖ

    జీవో 49కు వ్యతిరేకంగా గతంలో మావోయిస్టుల పేరిట లేఖ కూడా విడుదలైంది. ఈ జీవోతో ఆసిఫాబాద్​ జిల్లాలోని 339 గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. మే 5న తీసుకొచ్చిన ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు. కాగా.. తాజాగా ప్రభుత్వం జీవోను నిలిపివేయాలని నిర్ణయించడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  CM Revanth Reddy | విలన్లు క్లైమాక్స్​లో అరెస్ట్​ అవుతారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Tiger Conservation | సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

    జీవో నంబర్​ 49ను ప్రభుత్వం రద్దు చేయడంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క (Minister Seehtakka), ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కలిశారు. జీవోను వెనక్కి తీసుకోవడంపై వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు.

    Latest articles

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    More like this

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...