అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | పోటీతత్వంతోనే వికసిత్ భారత్ (Viksit Bharath) లక్ష్యం నెరవేరుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. తెయూ వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (Telangana Commerce Association) ఆధ్వర్యంలో మంగళవారం వన్ డే సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్తో (Skill Based Education) పాటు ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. ఆధునిక భారతావనిలో వాణిజ్యశాస్త్ర అభివృద్ధి వేగం పుంజుకుంటోందన్నారు.
కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు (TU VC T Yadagiri Rao), రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ర్పైజెస్ (Institute of Public Enterprises) డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (Telangana Commerce Association) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ పురుషోత్తం రావు, అధ్యక్షుడు ప్రొఫెసర్ చెన్నప్ప, జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.