ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    Minister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (State Panchayat Raj Minister Seethakka) అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి మహిళలకు మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంకులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

    Minister Seethakka | మహిళా సంఘాలకే బాధ్యతలు..

    ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల (government school students) స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించడం ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన యూనిఫాంలను కుట్టే పనులను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బడ్జెట్​లో స్త్రీ, శిశు సంక్షేమానికి 2862 కోట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు.

    READ ALSO  Jakkidi Shivacharan Reddy | యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి చేస్తా

    Minister Seethakka | అధికమొత్తంలో మహిళలకు రుణాలు..

    మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను సర్కారు ప్రతిపాదించిందని, గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti scheme) మహిళకు ఒక వరం లాంటిదన్నారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం రూ. 20.56 కోట్ల చెక్కును అందజేశారు.

    అలాగే కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.5.28 కోట్ల వడ్డీ రాయితీ, చెక్కు, లోన్ బీమా కింద 22 లక్షల రూపాయల చెక్కు, ప్రమాద బీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ. 30 లక్షలు చెక్కును అందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్ చందర్ నాయక్, సెర్ఫ్ సీఈవో నగేష్, డీఆర్డీవో సురేందర్, కామారెడ్డి ఆర్డీవో వీణ, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    READ ALSO  Gurukul School | గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

    Latest articles

    Nizamabad | విద్యార్థులకు నోట్​బుక్కుల పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గాదె సతీష్ మెమోరియల్ చారిటబుల్...

    ACB Raids | గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు.. అవినీతి అధికారుల్లో గుబులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రాష్ట్రంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. గతంలో ఫిర్యాదులకు సంబంధించి...

    Local Body Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో...

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    More like this

    Nizamabad | విద్యార్థులకు నోట్​బుక్కుల పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గాదె సతీష్ మెమోరియల్ చారిటబుల్...

    ACB Raids | గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు.. అవినీతి అధికారుల్లో గుబులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రాష్ట్రంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. గతంలో ఫిర్యాదులకు సంబంధించి...

    Local Body Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో...