అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సును విజయవంతం చేయాలని పాఠ్య ప్రణాళికా సంఘం (Curriculum Planning Committee) అధ్యక్షుడు డాక్టర్ లక్షణ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (College of Arts and Science) సెమినార్ హాల్లో ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి (Telangana Council of Higher Education) డిగ్రీలో మార్పులు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై స్పష్టత తీసుకొచ్చేందకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి టీయూ అనుబంధ కళాశాలల తెలుగు అధ్యాపకులు హాజరుకావాలన్నారు. సదస్సులో ఆచార్య లావణ్య, ఆచార్య కనకయ్య, తదితరులు పాల్గొననున్నారు.