అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్కు (Perkit) చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ జీజీహెచ్లో (GGH) వైద్యులు సరిగ్గా చికిత్స చేయట్లేదని పలువురు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ వృద్ధురాలికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే తమకు దగ్గరగా ఉండే ఆర్మూర్లో చికిత్స చేయించుకుంటామని బుజ్జమ్మ బంధువులు చెప్పడంతో ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాలికి గాయం తీవ్రంగా ఉందని మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్కు తరలించారు. అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.