అక్షరటుడే, వెబ్డెస్క్:Minister Rajnath Singh | పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారత్లో విలీనమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను భారతదేశం, నేను తిరిగి వచ్చాను” అని పీవోకే(POK) ప్రకటిస్తుందన్నారు. పీవోకే ప్రజలు భారత్తో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. త్వరలోనే పునరేకీకరణ సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII ) వార్షిక వ్యాపార సదస్సు-2025 ప్రారంభ సదస్సలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రక్షణ ఎగుమతి 10 సంవత్సరాల క్రితం రూ. 1000 కోట్ల కంటే తక్కువగా ఉందని, ఇప్పుడు అది రూ. 23,500 కోట్ల రికార్డు స్థాయికి చేరుకుందన్నారు.
Minister Rajnath Singh | మేక్-ఇన్-ఇండియా చాలా అవసరం
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో మొత్తం దేశ ప్రజలు మేక్ ఇన్ ఇండియా ప్రచారం విజయాన్ని చూశారని, అర్థం చేసుకున్నారని, అనుభూతి చెందారని రక్షణ మంత్రి తెలిపారు. “నేడు రక్షణ శాఖలో మేక్-ఇన్-ఇండియా(Make In India) భారతదేశ భద్రతకు మాత్రమే కాకుండా దాని శ్రేయస్సుకు కూడా అవసరమని నిరూపించబడింది” అని సింగ్ గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని, బలాన్ని ప్రదర్శించడం ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయని ఆయన నొక్కి చెప్పారు. మేము ఫైటర్ జెట్లను లేదా క్షిపణి వ్యవస్థలను తయారు చేయడం మాత్రమే కాదు. తదుపరి తరం యుద్ధ సాంకేతికతలకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పారు.
Minister Rajnath Singh | విభజన దేశ విధానం కాదు..
భారత్ ఇప్పుడు కలిసి ఉండాలన్న భావనతోనే ఉంటుందని, విభజించడం దేశ విధానం కాదని రాజ్నాథ్సింగ్(Minister Rajnath Singh) అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు ఇండియాతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. “భారతదేశం ఎల్లప్పుడూ హృదయాలను అనుసంధానించడం గురించి మాట్లాడుతుంది, వాటిని విభజించడం గురించి కాదు” అని పేర్కొంటూ, పీవోకే, ఇండియా భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను ఆయన పునరుద్ఘాటించారు. “మన స్వంత భాగం, పీవోకే.. స్వయంగా తిరిగి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ విధానం సంఘర్షణ కంటే ఐక్యత, ఉమ్మడి వారసత్వంలో ఇమిడి పోయిందని చెప్పారు. భౌగోళికంగా, రాజకీయంగా మన నుంచి విడిపోయిన పీవోకేలోని ప్రజలపై తనకు నమ్మకం ఉందని సింగ్ అన్నారు. వారు ఏదో ఒక రోజు భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని ఆకాంక్షించారు.
Minister Rajnath Singh | పాక్ మూల్యం చెల్లించక తప్పదు..
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్(Pakistan) తగిన మూల్యం చెల్లించక తప్పదని రక్షణ మంత్రి హెచ్చరించారు. పాక్తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమేనని స్పష్టం చేశారు. “ఉగ్రవాద వ్యాపారాన్ని నడపడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. కానీ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని భారత్ దాడులతో పాకిస్తాన్కు అర్థమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యూహం, ప్రతిస్పందన రెండింటినీ మేము పునఃరూపకల్పన చేశాము. పాకిస్తాన్తో చర్చలు జరిగినప్పుడల్లా, అది ఉగ్రవాదం, పీఓకేపై మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు మా స్వంతమని, మా కుటుంబంలో భాగమని నేను నమ్ముతున్నాను. “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”(Ek Bharat Shreshtha Bharat) అనే తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాము. నేడు మన నుంచి భౌగోళికంగా, రాజకీయంగా వేరు చేయబడిన మన సోదరులు కూడా ఏదో ఒక రోజు భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది” అని మంత్రి అన్నారు.