అక్షరటుడే, వెబ్డెస్క్: Covid | ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) ప్రస్తుతం మళ్విలీ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు (Covid cases) మళ్లీ పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల (Corona cases) సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ (Andhra Pradesh and Telangana) కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో మరో కేసు నమోదైనట్లు సమాచారం. విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలికకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
Covid | విశాఖపట్నంలో..
విశాఖలో 14 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ (Corona positive) కేసు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికకు ఒమిక్రాన్ వేరియంట్గా (Omicron variant) సోకినట్లు వైద్యులు నిర్థారించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు (Corona positive cases) నమోదవుతుండడంతో భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖపట్నంలో (Visakhapatnam) కోవిడ్ కేసు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు Vizag city జాగ్రత్త చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అనుమానం వస్తే పరీక్ష చేయించుకుని చికిత్స పొందాలని చెబుతున్నారు.