అక్షరటుడే, వెబ్డెస్క్ : Miss World 2025 |మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్లో పలు ఈవెంట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాల సుందరీమణులు నగరంలోని పాతబస్తీలో హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్కు చేరుకున్న వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు.
లాడ్బజార్లో మిస్ వరల్డ్ పోటీదారులు పలు దుకాణాలను సందర్శించారు. ఆయా దుకాణాల్లో వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వారి నుంచి వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. హైదరాబాద్ విశిష్టతను, చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు.
చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ అనంతరం వారు చౌహముల్లా ప్యాలెస్ను సందర్శించారు. బుధవారం పోటీదారుల్లోని ఒక బృందం వరంగల్లోని వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటను సందర్శించనుంది. మరో బృందం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తుంది.