ePaper
More
    HomeజాతీయంMadhya Pradesh | రూ.40 కోట్లతో నిర్మించిన వంతెన.. నామరూపాల్లేకుండా పోయింది

    Madhya Pradesh | రూ.40 కోట్లతో నిర్మించిన వంతెన.. నామరూపాల్లేకుండా పోయింది

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్​ (Madhya Pradesh)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది.

    కాగా.. భారీ వర్షాల దాటికి రూ.40 కోట్లతో నిర్మించిన ఓ వంతెన నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్​లోని రాష్ట్ర రహదారి 22 (State Highway 22)పై ఇటీవల రూ.40 కోట్లతో వంతెన నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన మొత్తం కొట్టుకుపోయింది.

    రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌‌‌– హోషంగాబాద్‌ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారలు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

    దీనిపై అధికారులు మాట్లాడుతూ.. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంతెన దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. దీంతో వాహనాలను దారి మళ్లించామని చెప్పారు. ఇండోర్‌లోని మేఘదూత్ గార్డెన్ సమీపంలో భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయింది. కాగా.. ఈ ఘటనలపై మంత్రి కైలాష్ విజయవర్గియా దర్యాప్తునకు ఆదేశించారు.

    READ ALSO  Rahul Gandhi | దేశ నేర రాజ‌ధానిగా బీహార్.. బీజేపీ, నితీశ్‌ల‌పై రాహుల్‌గాంధీ ఫైర్‌

    Latest articles

    Ura Pandaga | ఊర పండుగ ప్రత్యేకం “బండారు”.. కార్యక్రమంలో పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

    అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్...

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు...

    Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...

    GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GGH Superintendent | నిజామాబాద్​ జిల్లా జనరల్​ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్​గా డాక్టర్​ పి కృష్ణ...

    More like this

    Ura Pandaga | ఊర పండుగ ప్రత్యేకం “బండారు”.. కార్యక్రమంలో పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

    అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్...

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు...

    Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...