అక్షరటుడే, ఆర్మూర్: Palle GangaReddy | జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో Pahalgam జరిగిన మారణకాండకు భారత్ బదులు తీర్చుకుంటుందని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి National Turmeric Board Chairman Palle Gangareddy పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఈ దుశ్చర్య వెనక ఎంతటివారున్నా భారత ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
