అక్షరటుడే, వెబ్డెస్క్:Encounter | జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు(Security forces) మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారికోసం జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత జమ్మూ కశ్మీర్లో భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి.
పహల్గామ్ దాడికి పాల్పడిన వారితో పాటు మిగతా ఉగ్రవాదుల కోసం నిత్యం సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఈ క్రమంలో షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు(Terrorists) ఉన్నారనే సమాచారం మేరకు మంగళవారం ఉదయం బలగాలు కూంబింగ్ చేపట్టాయి. బలగాలను చూసిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సోమవారం రాత్రి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై తమ పోరు ఆగదని చెప్పారు. దీంతో బలగాలు టెర్రరిస్టుల అంతు చూడడానికి జమ్మూ కశ్మీర్ను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.