అక్షరటుడే, వెబ్డెస్క్ :Terrorist Attack | జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. కావలికి చెందిన మధుసూదన్ ఈ ఘటనలో చనిపోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటన(Kashmir tour)కు వెళ్లాడు. అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి సైతం కాల్పుల్లో మరణించారు. పారిపోతున్నా చంద్రమౌళిని ఉగ్రవాదులు(Terrorist) వెంటాడి కాల్చిచంపినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.
