అక్షరటుడే, వెబ్డెస్క్: Temperature | రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ nizamabad district temperature జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని సీహెచ్ కొండూరు ch konduru గ్రామంలో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత Temperature నమోదు అయింది.
ఆదిలాబాద్ adilabadలో 45.2, నిర్మల్ nirmal 45.1, మంచిర్యాల manchiryalలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి ramareddy లో 44.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. మాడు పగిలేలా ఎండలు కొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండలు మండుతుండటంతో ఇళ్లలో నుంచి మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.