అక్షరటుడే, వెబ్డెస్క్:Cabinet Meeting | తెలంగాణ(Telangana) మంత్రివర్గం ఈ నెల 5న సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme), రాజీవ్ యువవికాసం(Rajiv Yuva Vikasam), వానాకాలం పంటలు, భూభారతిపై ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదికపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు డీఏ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగంలో ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించలేదు. ఈ క్రమంలో వారి సమస్యలపై చర్చించనున్నారు.
Cabinet Meeting | కాళేశ్వరంపై..
కాళేశ్వరం విజిలెన్స్, NDSA నివేదికలపైనా మంత్రివర్గ విస్తరణలో చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు ఈటల రాజేందర్(former minister Etala Rajender), హరీశ్రావు(Harish Rao)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది.
Cabinet Meeting | రైతు భరోసా.. బోనస్పై ప్రకటన ఉంటుందా..
ప్రభుత్వం సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో యాసంగిలో ఎంతో మంది రైతులు(Farmers) సన్నరకం వరి సాగు చేశారు. అయితే రైతుల నుంచి ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్ డబ్బులు జమ చేయలేదు. బోనస్(Bonus)పై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.
యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా(Raithu Bharosa) ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పడలేదు. నాలుగు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నగదు జమ చేసింది. మిగతా వారు రైతు భరోసా కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు. మరోవైపు వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఈ సీజన్కు సంబంధించిన రైతు భరోసా అయినా సకాలంలో వేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా, బోనస్పై కేబినెట్(Cabinet)లో చర్చించి ప్రకటన చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.