అక్షరటుడే, వెబ్డెస్క్ :Cabinet Meeting | తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై ఈ భేటీలో చర్చించనున్నారు.
గోదావరి జలాల తరలింపు కోసం ఏపీ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీ(Cabinet Meeting) నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.