అక్షరటుడే, వెబ్డెస్క్: Vande Bharat Train | వందే భారత్ రైలులో(Vande Bharat) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా చాలాసేపు రైలు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతి (Hyderabad to Tirupati) వెళ్తున్న వందేభారత్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా సుమారు గంట సేపటికిపైగా రైలు నెల్లూరులో (Nellore) నిలిచిపోయింది. ఏసీ కూడా పని చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
కాగా.. ఇదే రూట్లో వందే భారత్ రైలుపై (Vande Bharat train) ఇటీవలకాలంలో కొందరు దుండగులు రాళ్లు వేశారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మరువకముందే రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.