అక్షరటుడే, వెబ్డెస్క్: Air India | విమానం ఎక్కాలంటే ప్రయాణికులు హడలి పోతున్నారు. వరుస ఘటనలతో భయపడుతున్నారు.
ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత నిత్యం ఏదో ఒక చోట విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కూలిపోయి 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అయినా ఎయిర్ లైన్ (Airlines) సంస్థలు జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో నిత్యం ఏదో ఒక ఫ్లైట్లో సాంకేతిక సమస్య అంటూ వార్తలు వస్తున్నాయి.
Air India | ఎమర్జెన్సీ ల్యాండింగ్
తాజాగా మరో ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం 357 టోక్యో నుంచి ఢిల్లీకి బయలు దేరింది. అయితే క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగటంతో కోల్కతా ఎయిర్పోర్ట్ (Kolkata Airport)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. విమానంలో సాంకేతిక నిపుణులు తనిఖీలు చేపట్టారు.
కాగా.. ఆదివారం ఉదయం మరో ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబై నుంచి చెన్నైకి (Mumbai to Chennai) వెళ్తున్న AI639 విమానం గాలిలో ఉండగా పొగలు వచ్చాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. క్యాబిన్లో కాలిన వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని ముంబైకి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency landing) చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.