అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | గురుకుల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాయలేకపోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన చింతల శంకర్ అనే విద్యార్థి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాలలో (Achampeta Gurukul School) ఇంటర్ సెకండియర్ సీసీ చదువుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన సెకండియర్ పరీక్షల్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఫెయిలయ్యాడు. దీంతో ఏప్రిల్ 30వ తేదీ విద్యార్థి శంకర్ తండ్రి కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాడు. కాని ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డుకు (Inter board) పరీక్ష ఫీజు చెల్లించడం మరిచిపోయారు.
తీరా హాల్టికెట్ రాకపోయేసరికి విద్యార్థి శంకర్ ఖంగుతిన్నాడు. విచారిస్తే అసలు ఉపాధ్యాయులు ఫరీక్ష ఫీజు చెల్లించలేదని తెలిసింది. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించగా ఎక్కడో పొరపాటు జరిగిందని.. నోడల్ ఆఫీసర్తో మాట్లాడాలని.. ఇంటర్ విద్యాశాఖ హైదారాబాద్లో సంప్రదించాలని విషయాన్ని దాటేశారని విద్యార్థి తండ్రి వాపోయాడు. అధ్యాపకుల నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.