అక్షరటుడే, వెబ్డెస్క్: NTR District | ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లో మరో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీపీ పాగా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీ (Kondapalli Municipality) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
NTR District | కోర్టు తీర్పులో..
ఆంధ్రప్రదేశ్లో 2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా.. టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో గెలిచాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రంగా గెలిచిన శ్రీదేవి టీడీపీకి మద్దతు తెలిపారు. అదే సమయంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును వైసీపీకి వేయడంతో ఆ పార్టీ బలం కూడా 15కు సమమైంది. ఈ క్రమంలో అప్పటి టీడీపీ ఎంపీ కేశినాని ఎక్స్ అఫిషీయో(TDP MP Kesinani ex officio) సభ్యుడిగా ఓటు వేశారు. దీంతో టీడీపీ గెలుపొందింది.
కేశినేని నాని(Keshineni Nani) ఓటు చెల్లదని వైసీపీ హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కేశినేని నాని ఎక్స్ అఫిషీయో ఓటు చెల్లుతుందని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో తీర్పు కాపీని సోమవారం సీల్డ్ కవర్లో అధికారులకు అందించారు. దీంతో టీడీపీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ ఛైర్పర్సన్లుగా చుట్టుకుదురు శ్రీనివాస్(టీడీపీ), శ్రీదేవి(స్వతంత్ర) ఎన్నికయ్యారు.