More
    Homeఆంధ్రప్రదేశ్​TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: TDP : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత (Telugu Desam Party chief), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(AP CM Chandrababu) వెల్లడించారు. తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఈ మేరకు ఓ చానల్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

    తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని.. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించిన పార్టీ అని బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు ‘తెలుగు జాతి అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు.

    READ ALSO  Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

    ‘తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో’ అని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించిన చంద్రబాబు.. వాటిని అధిగమించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

    TDP : తెలుగు జాతి అభ్యున్నతే ముఖ్యం

    రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి అభ్యున్నతే ప్రధానంగా పని చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలనేదే తన ధ్యేయమన్నారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని చెప్పారు.

    అండమాన్(Andaman) వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ ఛైర్మన్​(municipal chairman)ను గెలిపించిందని.. ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు ఉదాహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటివరకు లేదని.. కానీ, ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు. తద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామని చెప్పారు.

    READ ALSO  Banswada Mandal | లాడ్జిని ప్రారంభించిన ఆగ్రోస్‌ ఛైర్మన్​

    TDP : బాబు ప్రకటనపై ఆసక్తికర చర్చ..

    తెలంగాణలో పోటీ చేస్తామన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ తెలంగాణ బరిలో నిలిస్తే ఎంతో కొంత ప్రభావం చూపడం ఖాయం. అయితే, అది ఏ పార్టీని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో రాజకీయ వాతావరణం మారింది.

    ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగడం అనేక రకాలుగా ప్రభావం చూపించే అవకాశముంది. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్​తో పాటు బీజేపీకి టీడీపీ నిర్ణయం ఒకింత కలవరపాటుకు గురి చేసే అంశమే. అయితే, ఏపీలో కూటమి కట్టిన బీజేపీ(BJP), టీడీపీ(TDP), జనసేన(JANASENA).. తెలంగాణలోనూ జట్టు కట్టి పోటీ చేసే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) ఓటు షేర్​ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

    READ ALSO  ED Raids | వాల్మీకి స్కామ్​లో ఈడీ దూకుడు.. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

    Latest articles

    Bridge Collapse | దేశంలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter...

    Alumni Students | పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Students | జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదువుకున్న 1999-2001 బ్యాచ్​కు చెందిన...

    Indur Tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    More like this

    Bridge Collapse | దేశంలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter...

    Alumni Students | పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Students | జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదువుకున్న 1999-2001 బ్యాచ్​కు చెందిన...

    Indur Tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...