ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో బుధవారం కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలకు అన్ని వర్గాలు తోడుగా నిలబడాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమకంటూ ఏదో ప్రతిభను కలిగి ఉంటారని, దానిని సమాజ ప్రగతి కోసం వినియోగించాలని తెలిపారు. సామాజిక, సాహితీ, సేవా, క్రీడా తదితర రంగాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారు తమ రంగాల ద్వారా క్షయ వ్యాధి నిర్మూలన కృషి చేయాలన్నారు.

    TB Mukt Bharat Abhiyan | మలావత్ పూర్ణ.. సౌమ్య తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..

    టీబీ ముక్త్ భారత్ అభియాన్​కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మలావత్ పూర్ణ (Malavat Purna), గుగులోత్ సౌమ్య (Guguloth Soumya) వ్యవహరించాలని గవర్నర్ కోరారు. కవులు, కళాకారులు, రచయితలు, తమ ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, రెడ్​క్రాస్ సొసైటీ (Red Cross Society) సమన్వయంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. చేపడుతున్న కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు.

    READ ALSO  Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    TB Mukt Bharat Abhiyan | లక్షణాలున్న వారికి చికిత్స

    క్షయవ్యాధి (Tuberculosis) నిర్మూలన చర్యల్లో భాగంగా హైరిస్క్​లో ఉన్న వారందరికీ చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. స్క్రీనింగ్, ఎక్స్​రే చేయిస్తూ.. తెమడ పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నామన్నారు. విరివిగా ఎక్స్​రే పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోగులకు పోషకాహార కిట్లను అందిస్తున్నామన్నారు. వ్యాధి నిర్మూలన కోసం విశేషంగా చేసిన కృషికి 2022-23 ఏడాదికి గాను జిల్లాకు బంగారు పతకం దక్కిందని గుర్తు చేశారు.

    కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

    గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మతో జిల్లా రెడ్​క్రాస్​ సొసైటీ ప్రతినిధులు

    Latest articles

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    More like this

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...