ePaper
More
    HomeతెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    ACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు చేయడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన పలువురు ఏ మాత్రం వెరవడం లేదు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ.. డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్ (Deputy State Tax Officer)​ ఏసీబీ అధికారులకు చిక్కింది.

    హైదరాబాద్ ​(Hyderabad) నగరంలోని మాదాపూర్​ ఏరియా డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​ ఎం సుధ లంచం తీసుకుంటుండగా అధికారులు మంగళవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ (GST Registrarion) కోసం ఆమె లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రూ.8 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ట్యాక్స్​ ఆఫీసర్​ సుధను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను అరెస్ట్​ చేశారు. నిందితురాలను రిమాండ్​కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

    READ ALSO  Old City | హైదరాబాద్​లో ఇరాన్​ సుప్రీం లీడర్​ పోస్టర్ల కలకలం

    ACB Trap | పెరిగిన అవగాహన

    ప్రస్తుతం ప్రజలకు అవగాహన పెరిగింది. గతంలో అధికారులను చూడగానే చాలా మంది భయపడేవారు. ఒంటరిగా కార్యాలయాలకు వెళ్లడానికి కూడా ఆలోచించేవారు. చోటామోటా నాయకులను తోడు తీసుకొని వెళ్లి తమ పనులు చేయించుకునే వారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులపై గతంలో అంతగా అవగాహన ఉండేది కాదు. అయితే ప్రస్తుతం అధికారుల అవినీతిపై సోషల్​ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో అవినీతి అధికారుకు ప్రజలు భయపడడం లేదు. లంచం అడిగిన వారిని ఏసీబీకి పట్టిస్తున్నారు. దీంతో ఈ మధ్య చాలా మంది అధికారులు ఏసీబీకి దొరుకుతున్నారు. అయితే ప్రజల్లో మరింత అవగాహన వచ్చి లంచం అడగాలంటేనే అధికారులు జంకాలని పలువురు పేర్కొంటున్నారు.

    ACB Trap | ఫిర్యాదు చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    READ ALSO  Padi Kaushik Reddy | అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి వార్నింగ్

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....