More
    HomeజాతీయంAir India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Air India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India Plane Crash : అహ్మదాబాద్ లో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 240 మందికి పైగా మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది.

    గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అంద‌రు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister) అక్క‌డికి చేరుకొని అక్క‌డ ఘటనపై ఆరతీశారు.

    READ ALSO  International Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    Air India Plane Crash : భారీ ఎక్స్‌గ్రేషియా..

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) ప్రకారం.. విమానంలో 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన స్వల్ప వ్యవధిలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది.

    కొద్ది రోజుల క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జూన్ 7న ఢిల్లీ నుంచి పారిస్ వెళ్తున్న విమానంలో సమస్య తలెత్తడంతో ఎలక్ట్రిక్ ఎర్రర్, కాలిన వాసన రావడంతో షార్జా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో నాడు ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం కూడా ఎయిర్ ఇండియా (AI 143) వినియోగించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ రకమే కావడం గమనార్హం.

    READ ALSO  Plane Crash | విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు.. డిప్యూటీ తహశీల్దార్​ అరెస్ట్​

    కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ TATA GROUP భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ (Tata Group Chairman Chandrasekaran) ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బ తిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్మిస్తామని కూడా తెలిపారు.

    అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అద్భుతం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. “పోలీసులు 11A సీటులో ప్రాణాలతో బయటపడిన ఒకరిని కనుగొన్నారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేం. విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS maalik మాలిక్ తెలిపారు.

    READ ALSO  BJP President | త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

    Latest articles

    Kamareddy | 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా...

    Japan | జ‌పాన్‌లో ఖాళీగా ఉన్న 90 ల‌క్ష‌ల ఇళ్లు.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య...

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...

    Reunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్...

    More like this

    Kamareddy | 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా...

    Japan | జ‌పాన్‌లో ఖాళీగా ఉన్న 90 ల‌క్ష‌ల ఇళ్లు.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య...

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...