ePaper
More
    HomeజాతీయంTamil Nadu | తమిళనాడులో విషాదం.. స్కూల్​ బస్సును ఢీకొన్న రైలు

    Tamil Nadu | తమిళనాడులో విషాదం.. స్కూల్​ బస్సును ఢీకొన్న రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tamil Nadu | తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్​ బస్సు(School Bus)ను రైలు ఢీకొంది. తమిళనాడులోని కడలూరు(Cuddalore)లో ఓ స్కూల్​ బస్సు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో బస్సు పట్టాలపై ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది విద్యార్థులు(Students) గాయపడ్డారు.

    స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెమ్మంగుప్పంలో రైల్వే గేటు(Chemmanguppam Railway Gate) దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు(Railway Officers) సైతం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

    READ ALSO  Vande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

    గతంలో తెలంగాణలోని మెదక్​ జిల్లా మాసాయిపేటలో సైతం ఓ స్కూల్​ బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును లెవల్ క్రాసింగ్ వద్ద నాందేడ్-హైదరాబాద్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదహారు మంది విద్యార్థులు, డ్రైవర్ క్లీనర్ మరణించారు. అక్కడ రైల్వే గేటు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ దేశవ్యాప్తంగా క్రాసింగ్​ల వద్ద రైల్వే గేట్లను ఏర్పాటు చేసింది. అయినా తాజాగా చెన్నైలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...