ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | ప్యాంట్​పై సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య.. భార్య, పోలీసుల వేధింపులే...

    Uttar Pradesh | ప్యాంట్​పై సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య.. భార్య, పోలీసుల వేధింపులే కారణమని లేఖ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. భార్య, పోలీసుల వేధింపుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు తన ప్యాంటుపై సూసైట్ నోట్ రాసుకుని చనిపోయాడు.

    Uttar Pradesh : ప్యాంటుపై..

    ఫరూఖాబాద్ జిల్లా Farrukhabad district లోని మౌదర్వాజా Maudarwaja పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుటాసి గ్రామం(Gutasi village) లో రామ్ రయీస్ కుమారుడు దిలీప్ కుమార్(25) ఉంటున్నాడు. సోమవారం రాత్రి దిలీప్​ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ప్యాంటు​పై రాసుకున్నాడు.

    మంగళవారం (జులై 15) ఉదయం దిలీప్ కుమార్ విగతజీవిగా పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సింగ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

    READ ALSO  Elephant | రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. రెండు గంటల పాటు నిలిచిన రైలు..: వీడియో వైరల్

    Uttar Pradesh : సూసైట్ నోట్​లో ఏముంది..?

    దిలీప్ కుమార్ తన ప్యాంటుపై సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఏమని రాశాడంటే.. తన భార్య ఫిర్యాదుతో పోలీసులు మహేశ్ ఉపాధ్యాయ్, యశ్వంత్ యాదవ్ తనపై దాడి చేశారని రాశాడు. రూ.50 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. తన భార్యతో కాంప్రమైస్​ కావాలని బలవంతం చేశారన్నాడు.

    దిలీప్ కుమార్ రాసిన సూసైట్ నోట్ రాసిన ప్యాంట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో దిలీప్ మామ బన్వారీ లాల్, బావమరుదులు రజనేశ్ రాజ్‌ పుత్, రాజుతోపాటు హథియాపుర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు మహేశ్ ఉపాధ్యాయ్, యశ్వంత్ యాదవ్ ఉన్నారు.

    Uttar Pradesh : ఏఎస్పీ ఏమన్నారంటే..

    దిలీప్, అతడి భార్యకు గొడవలున్నాయని ఏఎస్పీ డాక్టర్ సంజయ్ సింగ్ తెలిపారు. అతడి భార్య మౌదర్వాజా ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మౌదర్వాజా పుట్టింటివారు పోలీస్ స్టేషన్​కు వచ్చారని చెప్పారు. అక్కడ దిలీప్, మౌదర్వాజా రాజీకి వచ్చేలా పోలీసులు చేశారన్నారు.

    READ ALSO  Supreme Court | వీధికుక్కలకు ఇంట్లో ఆహారం పెట్టొచ్చుగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    ఆ తర్వాత దిలీప్ తన ఇంటికి వెళ్లి సూసైడ్​ చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పుకొచ్చారు. సూసైడ్ నోట్‌లో తన భార్య తండ్రి, సోదరుడు, బావమరిది పేర్లు రాసినట్లు తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్ల గురించి కూడా చెప్పారు. ఈ మేరకు ఆ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

    Latest articles

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    More like this

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...