అక్షరటుడే, బాన్సువాడ: Banswada Press Club | బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 69 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్షుడి బరిలో సుధాకర్ గౌడ్ (Sudhakar Goud), మామిళ్ల రాజు (Mamilla Raju) నిలిచారు. కాగా.. సుధాకర్ గౌడ్కు 40 ఓట్లు, మామిళ్ల రాజు 28 ఓట్లు దక్కాయి. ఒక ఓటు నోటాకు పడింది. దీంతో సుధాకర్ గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు పొటీలో ఉండగా గంట చంద్రశేఖర్కు 40 ఓట్లు, యూనుస్కు 28 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా ప్రమోద్ రెడ్డి, శ్యాంసుందర్, కోశాధికారిగా రుద్రంగి అశోక్, జాయింట్ సెక్రెటరీలుగా ఇలియాస్, సలీం, కార్యవర్గ సభ్యులుగా అరుణ్ రెడ్డి, జాకీర్, నజీర్, సుధీర్, మహేష్ ఎన్నికయ్యారు.
Banswada Press Club | 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు
బాన్సువాడ ప్రెస్ క్లబ్ (Banswada Press Club) 11 ఎన్నికల సంవత్సరాల తర్వాత నిర్వహించారు. 2014లో ఎన్నికల జరగగా ఆ తర్వాత కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి.